Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నేతలు లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ఓటుకు 20 నుండి రూ.30వేల వరకూ ఇచ్చే పరిస్థితి ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతుండటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల వేళ భారీగా నగదు చేతులు మారుతున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. డీఎస్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు మండలం చల్మెడలో తాజాగా నిర్వహించిన వాహనాల తనిఖీలో దాదాపు కోటి రూపాయల నగదు పట్టుబడింది. అయితే అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడ నుండి ఎక్కడకు తీసుకువెళుతున్నారు. ఆ నగదు ఎవరిది అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మరో సారి షాక్ ఇచ్చిన ఈడీ