(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 41 రోజులుగా అమరావతి ఆందోళనలో వెంకటేశ్వరరావు పాల్గొంటున్నారు. రాజధాని తరలిపోతుందన్న మనస్థాపంతో ఇప్పటికే పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నవులూరు వెళ్లి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 42వ రోజు కొనసాగుతున్నాయి.