కొందరి మనస్తత్వాలు ఎవరికీ అర్థం కావు. ఇది అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడ్డా తమ పిల్లలు మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. బ్రతికి ఉండగానే తమ తదనంతరం తమ స్వార్జిత ఆస్తి ఎవరికి చెందాలి అనే విషయంపై వీలునామా రాస్తుంటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఓ వ్యక్తి తన ఆస్తిని కుమారుడి పేరుతో రాయకుండా తన పెంపుడు కుక్కకు రాయడం విశేషం.
కుమారుడు ప్రవర్తన నచ్చని ఆ తండ్రి తన ఆస్తిలో సగం వాటాను పెంపుకు శునకం పేరున రాశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వాడా జిల్లాలో జరిగింది. బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే వ్యక్తికి తన పెంపుడు శునకం (జాకీ) అంటే చాలా ఇష్టం. కుమారుడు ప్రవర్తనపై తీవ్రంగా కోపంతో ఉన్న నారాయణ ఇటీవల పెంపుడు శునకానికి తన ఆస్తిలో సగం రాసి మిగిలిన సగాన్ని తన రెండవ భార్య చంపా వర్మ పేరున రాశాడు. రెండవ భార్య, జానీ (శునకం) తనను బాగా చూసుకుంటున్నారనీ, అందుకే తన ఆస్తి మొత్తాన్ని వీరిద్దరి పేరున రాస్తున్నాననీ, తన తదనంతరం ఈ ఆస్తి వారికే చెందుతుందని వీలునామా రాశారు. తన జానీ (శునకం)ని ఎవరైతే చూసుకుంటారో దాని పేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారని కూడా నారాయణ వీలునామాలో పేర్కొన్నారు.
ఓ వ్యక్తి తన పేరును ఉన్న ఆస్తిలో సగభాగాన్ని పెంపుడు శునకానికి రాయడం ఆశ్చర్యకమైన వార్త కావడంతో ఆ వ్యక్తి రాసిన వీలునామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది