(కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతూ ఉంది. జూరాల ప్రాజెక్టు, సుంకేసుల, హంద్రీ నుండి గురువారం ఉదయానికి 3,14,561 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు అయ్యింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసిలతో జలాశయం తొణికిసలాడుతోంది. దీంతో ప్రాజెక్టుకు చేరుతున్న మొత్తం 3,14,516 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ప్రాజెక్టు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.