ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రవాణ శాఖ 5 రకాల ఆన్ లైన్ సేవలు ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రజలకు సమయం ఆదా కానుంది. శ్రమ లేకుండా ఈ సేవలను ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే పొందే సౌలభ్యం కల్పించింది. ‘ఫెస్ట్’ (ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్) పేరుతో ఖైరతాబాద్ లోని రవాణ శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సేవలను ప్రారంభించారు.
ఈ సేవల ద్వారా డ్రైవింగ్ లెసెన్సుల విధానంలో కొత్త విధానం ప్రవేశపెట్టినట్టైంది. లెర్నింగ్ లైసెన్స్ విషయంలో డూప్లికేట్ పత్రాలు, బ్యాడ్జీలు అందజేయడం, డూప్లికేట్ లైసెన్స్, పాత కార్డు స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం, హిస్టరీ షీట్.. వంటి 5 రకాల సేవలను ఇకపై ఆన్ లైన్ లో అందించే ఏర్పాట్లు చేశారు. త్వరలో మరో 6 కొత్త సేవల్ని కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి పువ్వాడ ప్రకటించారు. ఈ సేవలను స్మార్ట్ ఫోన్ లో సైతం పొందచ్చని ఆయన వివరించారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రవాణ శాఖలో ఈ సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అందులో రవాణా సేవలు ఒకటని మంత్రి పువ్వాడ విజయ్ కుమార్ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?