photo courtesy by ANI
ఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత వైమానిక దళాల ధైర్య సాహసాలను శ్లాషిస్తూనే, భద్రతాదళాల త్యాగాలను రాజకీయ లబ్దికి ప్రధాని మోది వాడుకోవడాన్ని దేశంలోని 21 రాజకీయ పక్షాల నేతలు ఖండించారు. ఢిల్లీ పార్లమెంటరీ లైబ్రరీ హాలులో బుధవారం బిజెపియేతర పక్షాల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పుల్వామా ఉగ్రదాడి, వైమానికి దాడులు తదనంతర పరిణామాలపై చర్చించారు. వైమానిక దళాల ధైర్య సాహసాలను అభినందించారు. ప్రధాని మోది ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం లేదంటూ నేతలు ఖండించారు.
సమావేశం అనంతరం ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర నేతలు మాట్లాడారు. సంకుచిత రాజకీయాల కోసం జాతిభద్రతను పణంగా పెట్టకూడదని రాహుల్ అన్నారు. .
అఖిలపక్ష భేటీలో ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగ వ్యవహరించడం లేదని రాహుల్ విమర్శించారు.
ప్రస్తుత పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు.
సార్వభౌమాధికార రక్షణలో జాతి అభిమతాన్ని పరిగణలోకి తీసుకోవాలని నేతలు సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ సినియర్ నాయకులు అజాద్, ఎకె ఆంటోని, అహమ్మద్ పటేల్, టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధనేత్రి మమతా బెనర్జీ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జెడియు మాజీ నేత శరద్ యాదవ్, తృణముల్ కాంగ్రెస్ ఎంపి డేరిక్ ఒబ్రెయిన్, శిబూ సోరెన్ తదితరులు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?