భారతదేశంలో మంచి మార్కెట్ కలిగిన ఒప్పో నుండి త్వరలోనే ఓ వినూత్న ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అది ఒప్పో ఫైండ్ ఎక్స్ 2021లో రోలబుల్ కాన్సెప్ట్ ఫోన్. స్మార్ట్ఫోన్ డిజైన్లో ఓ కొత్త విప్లవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఈ సంస్థ కొత్త కాన్సెప్ట్ స్లైడ్-ఫోన్ను తీసుకురావడానికి జపనీస్ డిజైన్ స్టూడియో నెండోతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఇది X- అక్షంలో మూడు అతుకులను కలిగి ఉంది. వినూత్నంగా ఉన్న ఈ ఫోన్ కు సంబందించిన ఓకే వీడియోను ఒప్పో విడుదల చేసింది.
ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో లభించే స్మార్ట్ ఫోన్ల నమూనాకు బిన్నంగా ఉండనుంది. వినియోదారులు ఫోన్ రూపాన్ని నచ్చిన విధంగా ఏడు రూపాలకు పరిమాణాన్ని ఫోల్డ్ చేసుకునే విధంగా రూపొందించనున్నారు. ఇలాంటి ఆకృతులతో గతంలో నోకియా నుండి రాగా, ఇప్పుడు సామ్ సంగ్, మోటో నుండి కూడా వచ్చాయి కానీ ఇన్ని ఆకృతులుగా మార్చుకునే అవకాశం ఏ సంస్థ కల్పించలేదు. ఈ మోడల్ కు సంబందించిన వివరాలను ఇప్పటికే ఒప్పో జపాన్ సంస్థ నెండో పత్రికలకు తెలియజేశాయి.
ఇప్పటికే ఈ ఫోన్ కు సంబందించిన ప్రకటనను బట్టి ఒకే సారి వైర్ లెస్ హెడ్ ఫోన్స్ తో పాటు ఫోన్ కు కూడా వైర్ లెస్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఈ మోడల్ ను ఇరు సంస్థలు డిజైన్ చేసేందుకు కృషిచేస్తున్నాయి. అంతే కాదు ఒకే సారి ఛార్జింగ్ పెట్టి వైర్ లెస్ స్పీకర్, ఫోన్ కనెక్షన్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. కొత్త తరహా మోడళ్లను ఆదరించిన యువత ఈ ఫోన్ కూడా అందరిచే అవకాశం ఉంది.