ఢిల్లీ, ఫిబ్రవరి 1: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్డియేతర పక్షాల ఆధ్వర్యంలో సేవ్ నేషన్..సేవ్ డెమోక్రసీ పేరుతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎఐసిసి అధ్యక్షడు రాహుల్ గాంధీ, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ రాష్టాల నేతలు అజాద్, శరద్పవార్, అంటోని, అహ్మద్ పటేల్, శరద్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, కోదండరాం, డిఎంకే నేత కనిమొళి తదితరులు హజరైయ్యారు. ఈ సదస్సులో ప్రధానంగా ఈవిఎంల పనితీరు, దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.