పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని సమకూర్చాయి. మమతాదీదీకి సంఘీభంవంగా ప్రతిపక్ష నేతలందరూ మోహరిస్తున్నారు.
మరోపక్క కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కోల్కతా పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ను నివేదిక కోరారు. గవర్నర్ వెంటనే తనకు మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇంకోపక్క సిబిఐ రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కోల్కతాలో సిబిఐ నిర్వాకాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని టిడిపి ఎంపిలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అనుమతి తీసుకోకుండా, నోటీసులు ఇవ్వకుండా సిబిఐ అధికారులు కోల్కతా పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లడంపై ప్రశ్నించాలని చంద్రబాబు సూచిందారు. కోల్కతా వెళ్లి మమతకు సంఘీభావం ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సిబిఐను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సమాజావాదీ పార్టీ నేత అఖిలేష యాదవ్ విమర్శించారు.
కేసుపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు ఎందుకు వచ్చారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుందని అన్నారు. ఈ అంశంపై బిజెపియేతర పక్షాల నేతలందరితో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో అందరూ కలవాలని నిర్ణయించారు. చంద్రబాబు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులందరిపై కేసులు పెట్టి బిజెపి నేతలు ఆనందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.