టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల గుంటూరు పార్టీ కేడర్ తో ఇటీవల నిర్వహించిన జూమ్ సమావేశాలలో ఎంపీ గల్లా జయదేవ్ పై తీవ్రస్థాయిలో పార్టీ నేతలు మండిపడినట్లు టాక్. అధినేత నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో సీనియర్లు అదేవిధంగా కార్యకర్తలు ఎంపి తీరుపై మండిపడ్డారు అనే వార్తలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయాలని ఎంపీ గల్లా జయదేవ్ ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేల ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్లకు వేసుకోవచ్చు, కానీ ఎంపీ ఓటు మాత్రం తనకే వేయాలని కోరారట. అప్పట్లో గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి ఎమ్మెల్యే పోటీదారులు అదే విధంగా సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, ఒకానొక దశలో గొడవ కూడా జరిగినట్లు ఈ విషయాన్ని తాజాగా చంద్రబాబుకి కొంతమంది నేతలు గుర్తు చేశారట.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు చాలామంది పార్టీ కార్యక్రమాలకు సంబంధించి యాక్టివ్ గా లేరన్న టాక్ వస్తోంది. దూళిపాళ నరేంద్ర, రాయపాటి సాంబశివరావు, ప్రత్తిపాటి పుల్లారావు లాంటి అనేకమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కానీ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. వీళ్లంతా పార్టీకి దూరం అవడానికి కారణం గల్లా జయదేవ్ ఎన్నికల టైంలో చేసిన ప్రచారం కూడా ఒకటి అని ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడిన సమయంలో బయట పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ సీనియర్ నాయకుల నుండి గల్లా జయదేవ్ పై వ్యతిరేకత వస్తున్నా గాని బాబు మాత్రం ఆయన్ని గట్టిగా కవర్ చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. మొత్తంమీద చూసుకుంటే ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం గుంటూరు టిడిపి కేడర్ ని గందరగోళంలో పెడుతున్నట్లు ఏపీ రాజకీయాల లో వార్తలు వస్తున్నాయి.