OTT : ప్రస్తుతం ఓటిటి శకం నడుస్తోందని చెప్పొచ్చు.. లాక్ డౌన్ ముందు వరకు ఓటిటిల ఊసేలేదు.. అప్పటికి అదే హైఫై ఫ్లాట్ ఫామ్ ఏ.. దియేటర్ ఎప్పటిలాగే కామన్ మాన్ ఫ్లాట్ ఫామ్.. ఒక్కసారి గా కరోనా వైరస్ విజృంభించడంతో లాక్డౌన్ రావడం థియేటర్లు మూత పడడం వరుసగా జరిగిపోయాయి.. ఇక అందరూ నెట్టింట్లో అడుగుపెట్టారు.. దీంతో ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి చూసే పరిస్థితులు లేక అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ తో సహా ఎన్నో ఉండటంతో తమకు ఇష్టం వచ్చిన సమయంలో చూసేస్తున్నారు.. ఇటీవల 21 మంది పార్లమెంట్ సభ్యులు ఓటీటీ లో చూపిస్తున్న కంటెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లినా సంగతి తెలిసిందే.. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది..
రొమాంటిక్ సీన్లు , బూతులు, క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూపించే ఓటీపీ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ త్వరలోనే పోటీల కోసం ప్రత్యేక గైడ్లైన్స్ లోను తీసుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దానికి సంబంధించిన పని జరుగుతుందని చెప్పారు. సినిమాలకు సెన్సార్ మాదిరిగా ఓటీటీ లకు ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే ఇకపై రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతాలు కనిపించవు . ఒకవేళ ఉన్నా ఇప్పటివరకు ఉన్నంతగా ఉండవు. వీటి కోసమే పోటీలను ఆశ్రయించే వాళ్లందరికీ ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఓటీటీ ప్లాట్ ఫామ్లో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు సెన్సార్ ఉండదు. దీంతో మామూలు వాటితో పోల్చుకుంటే అక్కడ ప్రచారం అయ్యేవి పచ్చిగా ఉంటాయి. రొమాంటిక్ సీన్లు , బూతు డైలాగులు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు మొదలైనవి వీటిలో ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తారు.బిజినెస్ పరంగా కొందరు ఫిలిం మేకర్లు వీటికి ఆకర్షితులవుతున్నారు. కంటెంట్ కోసం ప్రేక్షకులు వీటిని ఆశ్రయిస్తున్నారు.ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి..ఓటీటీ హవా తగ్గుందో లేక ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాలి. భారత దేశంలో ప్రస్తుతం 40 కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ కి ప్రత్యేక నిబంధనలు విధించిన ఓటీటీ శకం నడుస్తుందో లేదో వేచి చూడాలి మరి.