టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. అంతేకాదు ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. ఎప్పుడో అ..ఆ తర్వాత మళ్ళీ భీష్మ సినిమాతో సాలీడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే అన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కొన్ని కీలక సన్నివేశాల కోసం టీం దుబాయ్ వెళ్ళిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ప్రేక్షకులోనూ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాకు 30 కోట్ల వరకు బడ్జెట్ అయిందని అంటున్నారు. ముందు మేకర్స్ అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారట. అయితే కరోనా మహమ్మారి లేకపోయి ఉంటే నితిన్ లాంటి క్రేజ్ ఉన్న హీరోకి ఇదేమంత పెద్ద బడ్జెట్ కాదు. కాని కరోనా కారణంగా అన్ని సినిమాల మేకర్స్ బడ్జెట్ ని కంట్రోల్ చేసుకుంటూ వీలైనంత తక్కువలో సినిమాని కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో రంగ్ దే కోట్లు అన్నది కాస్త ఓవర్ బడ్జెటే అన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ప్రముఖ ఓటీటీలు రంగ్ దే కోసం పోటీ పడుతున్నాయట. అయితే మేకర్స్ మాత్రం థియోటర్స్ లో రిలీజ్ చేయాలన్న గట్టి ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే 40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో. సినిమా మీద మాత్రం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గ్యారెంటీగా హిట్ అన్న మాట వినిపిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?