PADMA AWARDS: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల పంక్షన్ కన్నుల పండువగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి దేశప్రధాని నరేంద్ర మోదీ, రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. వీరంతా పద్మ అవార్డులు (padma awards) అందుకున్న వారిని అభినందించారు.
Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ.. పింకీ, కాజల్ పై విశ్వ కామెంట్లు..!!
తెలుగు వారు నలుగురురు..
ఈ సారి నలుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు వరించాయి. వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నుంచి ముగ్గురు వ్యక్తులు ఉండగా.. తెలంగాణ రాష్ర్టం నుంచి ఒక్కరు ఉన్నారు. తెలుగు వారు కాకుండా మొత్తం ఈ ఏడాది 119 మందికి పద్మ అవార్డులు వరించాయి. వీళ్లలో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ విభూషణ్, మిగిలిన 102 మందికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. కేవలం మన దేశానికి చెందిన వారికే కాకుండా పక్క దేశాల వారికి కూడా పద్మ అవార్డులు వచ్చాయి.
SBI: SBI వినియోగదారులకు అలెర్ట్… ఆ సర్వీస్ లో మార్పులు …!
మన ఎస్పీబీకి కూడా…
గతేడాది కరోనాతో మనల్ని విడిచిపోయిన లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు చనిపోయిన తర్వాత అరుదైన ఘనత దక్కింది. అతడికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇతను కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నవరపు రామస్వామి, అసవడి ప్రకాశ్ రావు, నిడుమోలు సుమతి, తెలంగాణ నుంచి కనకరాజులకు పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.
పద్మ విభూషణ్ అవార్డులు వచ్చింది వీరికే..
1) షింజో అబే (జపాన్)
2) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సింగర్
3) బెల్లె మోనప్ప హెగ్డే, వైద్యుడు కర్ణాటక
4) నరీందర్ సింగ్ కపానీ, సైంటిస్ట్ అమెరికా
5) మౌలానా వహిదుద్దీన్ ఖాన్, అధ్యాత్మికవేత్త
6) బీబీ లాల్, అర్కిటెక్ట్
7) సుదర్శన్ సాహూ, ఆర్టిస్ట్
ఈ ఏడుగురు వ్యక్తులకు పద్మ విభూషణ్ పురస్కారాలు వరించాయి. ఇండియాకు చెందిన వారు మాత్రమే కాకుండా జపాన్, అమెరికా దేశస్థులను కూడా పద్మ అవార్డులు వరించాయి. కేవలం పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన వారికి మాత్రమే కాకుండా మిగతా అవార్డీలందరికీ ప్రధాని, ఇతర మంత్రుడు కంగ్రాట్స్ తెలిపారు. కరోనా వలన ఎప్పుడో జరగాల్సిన అవార్డుల ఫంక్షన్ వాయిదా పడింది.