డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఏ హీరోతో సినిమా చేస్తున్నాడని ప్రకటన వచ్చినా హాట్ టాపిక్ గా మారుతుంది. చెప్పాలంటే సినిమా కన్ఫర్మ్ అయితే హీరో కంటే పూరి పేరే ఎక్కువగా ప్రచారంలో నిలుస్తుంది. అలాంటి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే పైసా వసూల్ కాంబోలో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ని త్వరలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం. అంతేకాదు 2021 సమ్మర్ కి రిలీజ్ చేయాలని బోయపాటి సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత బాలయ్య ఎవరి దర్శకత్వంలో నటిస్తాడన్న విషయంలో ఇంకా పక్కా క్లారిటీ రాలేదు. ఇద్దరు ముగ్గురు దర్శకులు బాలయ్య కోసం కథ సిద్దం చేసుకొని రెడీగా ఉన్నట్టు మాత్రం వార్తలు వస్తున్న సంగతి తెలిసందే.
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య నెక్స్ట్ సినిమా పూరి జగన్నధ్ దర్శకత్వంలో చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం పూరి.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక బాలయ్య.. పూరిల కాంబో లో సినిమా పట్టాలెక్కబోతుందని సమాచారం. సమ్మర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేలా పూరి పక్కాగా ప్లాన్ చేసుకొని ఉన్నాడట.
ఇంతక ముందు ఈ ఇద్దరి కాంబోలో పైసా వసూల్ వచ్చింది. మంచి టాక్ వచ్చినప్పటికి పైసా మాత్రం వసూల్ కాలేదు. దాంతో ఈ సారి భారీ హిట్ కొట్టే విధంగా పూరి బాలయ్య కోసం ఫుల్ ఎనర్జీతో ఉన్న కథ ను సిద్దం చేశాడని సమాచారం. చూడాలి మరి ఈసారైనా ఈ కాంబినేషన్ లో సినిమా భారీ హిట్ సాధిస్తుందో లేదో.