ఢిల్లీ, మార్చి 9 : భారత భూభాగంలోకి ప్రవేశించటానికి రెండు పాక్ డ్రోన్లు యత్నించాయి. భారత సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్ఎఫ్) ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాయి.
రాజస్థాన్ సమీపంలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు పాకిస్థాన్ డ్రోన్ యత్నించింది. దీన్ని గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో అది పాక్లోకి తిరిగి వెళ్లిపోయిందని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
శ్రీగంగానగర్ సమీపంలోని హిందూమల్కోట్ సరిహద్దు వద్ద ఉదయం ఐదు గంటలకు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిందని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. కాల్పులు జరపటంతో డ్రోన్ వెనుతిరిగినట్టు అధికారులు తెలిపారు.
అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడుల తర్వాత పాక్ డ్రోన్ ఒకటి గుజరాత్లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి ప్రవేశించగా సైన్యం దాన్ని కూల్చివేసింది. మార్చి 4న కూడా రాజస్థాన్లోని బికనీర్ సెక్టార్లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించగా భద్రతా బలగాలు సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?