పాకిస్తాన్ జైళ్లలో 537 భారతీయులు ఉన్నారని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్నిపాకిస్థాన్ ఈ రోజు భారత్ కు తెలిపింది. భారత్ ఇరు దేశాల మధ్యా ఉన్న ఒప్పందం మేరకు పాక్ విదేశాంగ శాఖ ఈ వివరాలను భారత్ కు అందజేసింది. పాక్ అందించిన సమాచారం మేరకు అక్కడి జైళ్లలో మగ్గుతున్న భారతీయులలో 54 మంది పౌరులు, 483 మంది జాలరులు ఉన్నారు. ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీలలో ఇరు దేశాలూ ఈ వివరాలను పరస్పరం తెలియజేసుకుంటాయి. ఆ మేరకు భారత్ కూడా తమ దేశంలోని జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల వివరాలను ఆ దేశ హై కమిషన్ కు అందజేసింది.
previous post