గత కొంత కాలం నుండి భారత్ సరిహద్దు ప్రాంతాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా నుండి అదేవిధంగా నేపాల్, పాకిస్తాన్ దేశాల నుండి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జూన్ మాసంలో గాల్వాన్ లోయ లో చైనా ఆర్మీ భారత్ సైనికులను పొట్టను పెట్టుకోవడం జరిగింది.
ఈ క్రమంలో భారత సైన్యం కూడా చైనా ఆర్మీ కి దీటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది. ఇరుదేశాల మధ్య సరిగ్గా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ రెండు దేశాలు వెనక్కి తగ్గటం జరిగాయి. ఇదిలా ఉండగా తాజాగా భారత్ ఆర్మీ ని ఉద్దేశించి పాక్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు ప్రాంతాల వద్ద భారత్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ భారత సైనికులు ఉల్లంగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ భారత సైనికులకు దీటుగానే సమాధానం చెబుతున్నట్లు పాక్ సైనిక అధికారి చెప్పుకొచ్చారు. అంత మాత్రమే కాక భారత్ ఆర్మీ సరిగ్గా వ్యవహరించకపోతే పాక్ సైన్యం ఇంకా దీటైన సమాధానం చెబుతుందని ఆ దేశ సైనిక అధికారి వార్నింగ్ ఇవ్వటం అంతర్జాతీయ మీడియాలో సంచలనం అయ్యింది. ఇదిలా ఉంటే భారత్ ఆర్మీ కేవలం ఉగ్రవాద గ్రూపుల పై మాత్రమే దాడి చేస్తుంటే దానిని పాక్ సైనికాధికారి.. పాక్ ఆర్మీ పై దాడి చేసినట్లు మాట్లాడటం దారుణమని కేంద్ర రక్షణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.