ఇస్లామాబాద్, మార్చి 9 : రాంచీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య శుక్రవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలు ధరించి ఆటలో పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సిఆర్పిఎఫ్ జవాన్లకు కోహ్లీ సేన ఈ విధంగా నివాళులు అర్పించింది. బిసిసిఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) ముందే దీనిపై ప్రకటన చేసింది.
కాగా, భారత కికెటర్లు ఆర్మీ టోపీలు ధరించడాన్ని పాక్ తప్పుపట్టింది. భారత టీం క్రికెట్ను రాజకీయం చేసిందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)ను పాక్ మంత్రి ఫవాద్ చౌధరీ కోరారు. భారత్ చేసిన ఈ చర్యకు నిరసనగా ఐసిసి ముందు ఫిర్యాదు చేయాలని ఆయన పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)కు విన్నవించారు.
తదుపరి ఆడనున్న మ్యాచుల్లో కూడా భారత టీం ఆర్మీ టోపీలను ధరించటం కొనసాగిస్తే పాక్ టీం కూడా కశ్మీర్లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్కు నిరసనగా నలుపు బ్యాండ్లు ధరిస్తారని చౌధరీ పేర్కొన్నారు.