చేపలు పట్టే పడవ ద్వారా పాకిస్థాన్ నుండి భారత్ కు భారీగా మాదక ద్రవ్యాలను (డ్రగ్స్) ను తరలిస్తుండగా కోస్ట్ గార్డు అధికారులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ సిబ్బంది పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలో గుజరాత్ లోని జాభౌ తీరానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో భారత జలాల్లో ప్రవేశించిన పాక్ పడవను గుర్తించి కోస్ట్ గార్డు సిబ్బంది పట్టుకున్నారు. ఈ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్థాన్ పౌరులను అదుపులోకి తీసుకుని వారి నుండి 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.200 కోట్ల విలువ ఉంటుందని అంచనా.
ఈ డ్రగ్స్ ను వారు గుజరాత్ తీరానికి చేర్చి అక్కడ నుండి రోడ్డు మార్గంలో పంజాబ్ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. బోట్ ను సీజ్ చేసిన అధికారులు… నిందితులను విచారణ నిమిత్తం జాభౌకు తరలించారు.
షర్మిల పై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారంకు ఎమ్మెల్యేల ఫిర్యాదు .. ఫిర్యాదులపై షర్మిల స్పందన ఇది