జైపూర్, ఫిబ్రవరి 20 : పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్కు చెందిన ఒక ఖైదీని సహచర ఖైదీలే రాళ్లతో కొట్టి దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్ సెంట్రల్ జైలులో జరిగింది.
పాకిస్థాన్కు చెందిన ఖైదీ షకీరుల్లా సెంట్రల్ జైలులో హత్యకు గురయ్యాడు. గూఢచర్యం కేసులో షకీరుల్లా శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ ఘటనలో ముగ్గురు ఖైదీల ప్రమేయం ఉన్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు.
జైలులో పాకిస్థాన్ ఖైదీ మృతిని జైళ్ల శాఖ ఐజి దృవీకరించారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దేశ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?