శ్రీనగర్ : సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధ విమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఎన్డిటివి తొలుత ప్రకటించినా తరువాత ఉపసంహరించుకుంది. హింధూస్థాన్ టైమ్స్ మాత్రం ఎఎన్ఐ న్యూస్ ఎజన్సీ తెలియజేసిందంటూ, పాకిస్థాన్కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం లామ్ లోయ ప్రాంతంలో కూల్చివేసిందని పేర్కొంది.
నౌషెరా సెక్టార్లో యుద్ధ సెక్టార్లో శకలాలు పడ్డాయని పేర్కొంది.
ఎఫ్ 16 యుద్ధవిమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసిందా, లేక అదే పడిపోయిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇంత వరకూ అధికారిక ప్రకటన విడుదల కాలేదు.