ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రివర్గ మార్పులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎన్నికవడంతో మంత్రి పదవులకు రాజీనామా చేసారు. ఈ స్థానంలో కొత్త మంత్రులను జగన్ ఎన్నుకోనున్నారు.
ఒక మంత్రిగా శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఒక మంత్రిగా ఖరారయ్యారు. ఈ మేరకు ఆయనే స్వయంగా మీడియాకు విషయాన్ని తెలియజేసారు. అప్పలరాజు వృత్తి రీత్యా వైద్యుడు, మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి. అసెంబ్లీలో విషయాన్ని సూటిగా చెప్పడంలో, ప్రతిపక్షాన్ని తనదైన వాక్ చాతుర్యంతో ఇరుకున పెట్టడంలో అప్పలరాజు సిద్ధహస్తుడు. మోపిదేవి సామజిక వర్గానికి చెందిన వ్యక్తి. రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ రెండవ మంత్రి అని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?