Pan indian directors: రాజమౌళి, శంకర్, ప్రశాంత్ నీల్..ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన దర్శకులు. రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత సింహాద్రి, సై, యమదొంగ, మగధీర, విక్రమార్కుడు, ఛత్రపతి లాంటి సినిమాలతో తన సత్తా చాటుతూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి రేంజ్ ప్రపంచ స్థాయిలో పెరిగింది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసింది. రెండు భాగాలు వచ్చిన బాహుబలి సినిమా హాలీవుడ్ మేకర్స్ను కూడా మేకింగ్ పరంగా మెస్మరైజ్ చేసేసింది.
ఈ సినిమా తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో కూడా పాన్ ఇండియన్ రేంజ్లో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీసే దర్శకులున్నారని నిరూపణ అయింది. అంతేకాదు తెలుగులో బహుభాషా చిత్రాలను తీయగల సత్తా మన మేకర్స్ కు కూడా ఉందని అలాంటి నిర్మాతలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని రాజమౌళి తన బాహుబలి సినిమాల ద్వారా నిరూపించారు. ఈ క్రేజ్ వల్లే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
Pan indian directors: ఈ సినిమా వసూళ్ళు దాదాపు 1000 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఈ మూవీ దాదాపు 1500 కోట్ల వరకు వసూళ్ళు రాబడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక కోలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా పాపులర్ అవడమే కాకుండా తన సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గదని రోబో సినిమాతో నిరూపించిన దర్శకుడు ఎన్.శంకర్. ఆయన మొదటి సినిమా జెంటిల్ మేన్ నుంచి గత చిత్రం రోబో2.ఓ వరకు ఒక్కో సినిమాతో తన స్టార్ డం పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇండియన్ 2 అలాగే మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియన్ సినిమాను అలాగే బాలీవుడ్లో అపరిచితుడు రీమేక్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో దాదాపు 3000 కోట్ల వరకు శంకర్ సినిమాలు బిజినెస్ చేయడం ఖాయం అంటున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకుల సరసన చేరారు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో ఒక్కసారిగా పాన్ ఇండియన్ డైరెక్టర్గా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్..దాదాపు సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అంత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయన కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్గా కేజీఎఫ్ 2 రూపొందించారు. ఈ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. అంతేకాదు ఈ సినిమా వసూళ్ళు దాదాపు 1000 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Pan indian directors: ఈ దర్శకులు తమ సినిమాలతో ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారో.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ సినిమాగా బహుభాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కూడా దాదాపు 1000 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఆ స్థాయిలో ఉంది. ఈ ఏకంగా ఇప్పుడు ఎక్కువ వసూళ్ళు రాబట్టే సినిమాలు రాజమౌళి, ఆర్ఆర్ఆర్, శంకర్ సినిమాలు, ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న కేజీ ఛాప్టర్ 2, సలార్ అని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ దర్శకులు తమ సినిమాలతో ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారో.