Adavi shesh: టాలీవుడ్లో అందరు హీరోలు పెట్టుకున్న టార్గెట్స్ రెండే. అందులో ఒకటి పాన్ ఇండియన్ స్టార్గా ప్రభాస్ రేంజ్కి రావాలని, మరొకటి బాలీవుడ్లో మార్కెట్ సాధించాలని. అందుకే అందరు హీరోల ఖాతాలలో పాన్ ఇండియన్ సినిమాలే ఉన్నాయి. కానీ, స్ట్రైట్ సినిమా సైన్ చేసి కంప్లీట్ చేసింది ప్రభాస్ ఒక్కడే. మిగతావాళ్ళు తమ సినిమాలను అన్నీ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, తారక్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్దమవుతున్నారు.
ఇక టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ హిట్ అనేది ఒక్కటి కూడా దక్కకపోయినా ఇప్పుడు తెలుగులో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఛత్రపతి సినిమా రిమేక్ ద్వారా హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ గానీ, ఎన్.టి.ఆర్ గానీ, అల్లు అర్జున్ గానీ హిందీలో స్ట్రైట్ సినిమాలకు సైన్ చేసింది లేదు. కానీ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ మాత్రం ఒకేసారి రెండు సినిమాలకు సైన్ చేశాడు. స్వయంగా ఈ విషయాన్ని తానే వెల్లడించాడు.
Adavi shesh: కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కోసం కాకుండా కొత్తగా ట్రై చేస్తూ సక్సెస్లు అందుకుంటున్న శేష్..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ ఆధారంగా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్, తెలుగమ్మాయి శోభిత దూళిపాళ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా 2022, ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నారు. కాగా, ఆయన నెక్స్ట్ సినిమాలు రెండు హిందీలో చేయబోతున్నాడు అడవి శేష్. తెలుగులో క్షణం, గూఢాచారి, ఎవరు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అందరు హీరోల మాదిరిగా కమర్షియల్ హీరో అనే ఇమేజ్ కోసం కాకుండా కొత్తగా ట్రై చేస్తూ సక్సెస్లు అందుకుంటున్న అడవి శేష్ ఇప్పుడు బాలీవుడ్ హిందీ సీమలో అడుగుపెడుతున్నాడు. ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.