Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కమిటయిన నాలుగు సినిమాలను వీలైనంత త్వరలో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇదే జరిగితే ప్రభాస్ రేంజ్ ఊహించలేము. ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సలార్ సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ అంభు ఆర్వి లాంటి వారు పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోనూ ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వీటితో పాటు బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఈ మూడు సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి.
Prabhas : వైజయంతీ మూవీస్ వారి సినిమా షూటంగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
తిరిగి మళ్ళీ ఇండస్ట్రీలో అన్ని సినిమాల షూటింగ్స్ ప్రారంభం అవుతున్న క్రమంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలు కూడా వరుసగా షూటింగ్ లకు హాజరు కాబోతున్నాడు. ఒక వైపు రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటూనే, మరో వైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా సాగుతోంది. ఇక ఆదిపురుష్ కూడా తాజా షెడ్యూల్ జరుగుతోంది. కానీ ఇందులో ప్రభాస్ జాయిన్ కాలేదు. అయితే ఈ ఏడాది చివరికి ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేయనున్నట్టు పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత వైజయంతీ మూవీస్ వారి సినిమా షూటంగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.