Panjab Haryana High Court: ముస్లిం యువతుల వివాహ వయస్సుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 16 ఏళ్లు నిండిన ఓ ముస్లిం యువతి తనకు ఇష్టమైన యువకుడిని వివాహం చేసుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. సదరు యువతి పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. షరియా చట్టాన్ని ఉటంకిస్తూ కీలక తీర్పును వెలువరించింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన యువకుడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే వివాహం చేసుకునేందుకు అర్హురాలేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మహిళల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు పెంచుతూ చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మహిళల వివాహా వయస్సు 21 ఏళ్లు పెంచడంపై ప్రతిపక్షాల నుండి ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ..మహిళలు చదువుకుని ప్రగతి సాధించడానికి మహిళల వివాహ వయస్సును 18 ఏళ్ల నుండి 21 సంవత్సరాలకు పెంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో .. భారత చట్టాలను కాదని షరియా చట్టం ప్రకారం పంజాబ్, హర్యానా హైకోర్టు ..ముస్లిం యువతులు 16 ఏళ్లు నిండగానే వారికి ఇష్టమైన వ్యక్తితో వివాహం చేసుకోవచ్చని తీర్పు వెలువరించడం తీవ్ర సంచలనం అయ్యింది.