Free biryani: వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎప్పటికప్పుడు కస్టమర్లకు రకరకాల ఆఫర్ల రుచి చూపిస్తూ వుంటారు. తాజాగా ప్యారడైజ్ ఇలాంటి కార్యక్రమమే చేపట్టింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా వున్న గుర్తింపు గురించి తెలిసినదే. ప్యారడైజ్ హోటల్ ఓ కస్టమర్కు తాజాగా ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. క్యాజువల్గా బిర్యానీ తినేందుకు వచ్చిన రక్షితా రెడ్డి అనే మహిళ చేత రెస్టారెంట్లో కేక్ కటింగ్ చేయించి, వేడుక చేసింది. అంతేకాకుండా ఆమెకు మంచి ఆఫర్ను కూడా అందించి ఆమెను ఆశ్చర్యపోయేలా చేసింది. నెలకొకసారి సంవత్సరం పొడవునా ఆమెకు ఉచితంగా బిర్యానీలను అందించనున్నట్లు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లాయల్ లవర్స్ కోసం ‘దిల్ సే థాంక్యూ’ కార్యక్రమం?
ప్యారడైజ్ రుచులను అమితంగా అభిమానించే లాయల్ లవర్స్ కోసం ‘దిల్ సే థాంక్యూ’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్యారడైజ్ హోటల్ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా 3.5 మిలియన్ల మంది లాయల్ ప్యారడైజ్ సర్కిల్ సభ్యులకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. విజయవంతమైన ‘దిల్ సే థాంక్యూ’ ప్రచారం కోసం తొలిసారిగా తమ 50,000వ కస్టమర్తో సెలబ్రేషన్స్ చేసినట్లు ప్యారడైజ్ వెల్లడించింది. హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్గా ప్యారడైజ్ బిర్యానీని అందివ్వడంలోని ఆనందాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ సరికొత్త ప్రచారాన్ని మే 2022లో ప్రారంభించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రూ.299 బిర్యానీని ఆర్డర్ చేసుకుంటే ఉచిత ఆఫర్ మీరూ పొందవచ్చు!
దీనికి అన్ని ప్రాంతాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. www.paradisefoodcourt.in ద్వారా ప్యారడైజ్ సర్కిల్ సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్ 30 లోగా నమోదు చేసుకొని రూ.299 విలువైన బిర్యానీని ఆర్డర్ చేసుకుంటే ఆఫర్ పొందొచ్చని తెలిపింది. నాణ్యమైన బిర్యానీ కోసం ఆసక్తిని పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్యారడైజ్ పేర్కొంది. అత్యుత్తమ ఆహారం, అత్యున్నత సేవలపై ఈ ప్రచారం ఆధారపడి ఉందని తెలిపింది. ప్యారడైజ్ ఫుడ్ కోర్డ్ CEO గౌతమ్ గుప్తా మాట్లాడుతూ.. మాపై అపారమైన ప్రేమ చూపుతున్న ప్యారడైజ్ సర్కిల్ సభ్యులందరికీ మేము ఉచిత బిర్యానీ అందించడం ద్వారా దిల్ సే థాంక్యూ చెబుతున్నందుకు సంతోషిస్తున్నాం అని అన్నారు.