Sarkaru vari pata : సర్కారు వారి పాట షూటింగ్ షెడ్యూల్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురాం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో కంప్లీట్ చేసుకొని వచ్చారు చిత్ర యూనిట్. నెలరోజులు నిర్విరామంగా జరిగిన ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఛేజింగ్ సీన్స్ ని తెరకెక్కించారట. అలాగే మహేష్ బాబు – కీర్తి సురేష్ మీద కీలకమైన సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.. కాగా రీసెంట్ గా గోవా లోనూ ఒక సాంగ్ షూట్ చేసినట్టు సమాచారం.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో సర్కారు వారి పాట కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. పోకిరి సినిమా తర్వాత మళ్ళీ మహేష్ బాబు లాంగ్ హేయిర్ కట్ లో కనిపించబోతున్నాడు. అంతేకాదు రెండు రకాల గెటప్స్ లో పరశురాం మహేష్ బాబు ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా త్వరలో సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ మొదలవబోతోంది అంటున్నారు.
Sarkaru vari pata : సర్కారు వారి పాట సినిమాలో ఎలా చూడబోతున్నామో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ షెడ్యూల్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సీన్స్ లో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. మహర్షి సినిమాలో కూడా మహేష్ స్టూడెంట్ గా కనిపించిన సంగతి తెలిసిందే. మరి సర్కారు వారి పాట సినిమాలో ఎలా చూడబోతున్నామో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2022 సంక్రాంతికి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.