వయసు మీద కొచ్చి కుటుంబాన్ని బాధ్యతగా నడిపించు కోవలసిన ఆడవాళ్లు శరీర కోరికల కోసం చేస్తున్న పనులు పిల్లల జీవితాలను యుక్త వయసులోనే కాటికి చేరుస్తూన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తల్లి చేసిన పనికి తట్టుకోలేక ఇద్దరు కొడుకులు సూసైడ్ చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట, నామన సముద్రానికి చెందిన వెంకటాచలం(47) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అతనికి భార్య జయదీప(40), విఘ్నేశ్వరన్ (20), యోగేశ్వరన్(18) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటాచలం మరియు జయ దీపా కి పెళ్లయి 20 సంవత్సరాలు పైగానే గడిచింది. ఈ తరుణంలో వెంకటాచలం కొద్దిగా అనారోగ్యం పాలయి కుటుంబానికి దూరంగా ఉండటంతో, జయదీప తన ఇద్దరు కుమారులతో వేరుగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీయడం తో వయసులో ఉన్న తన ఇద్దరు కుమారులు గురించి ఆలోచించకుండా అతనితో వెళ్లిపోయింది.
దీంతో యుక్త వయసులో ఉన్న ఇద్దరు కుమారులు తల్లి చేసిన పనికి తట్టుకోలేక ఇంటిలోనే ఆమె ధరించే చీర తో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఎంత తలుపులు కొట్టిన తీయకపోవడంతో స్థానికులు గట్టిగా తలుపులు పగలగొట్టడం తో ఈ దారుణమైన సంఘటన బయటపడింది. వెంటనే పోలీసులు వచ్చి ఆ మృతదేహాలను కిందకి దించి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద కుమారుడు విఘ్నేశ్వరన్ పుదుక్కోటై ప్రభుత్వకాలేజీలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతుండగా, యోగేశ్వరన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సరిగ్గా వీరు చదువుతున్న టైములో తల్లితండ్రులు చేసిన పనికి ఇద్దరు కుమారులు బలై పోవడంతో స్థానికులు అయ్యో అని సానుభూతి వ్యక్తం చేశారు.