మనిషి రోజు రోజుకి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు అయితే కట్టుబాట్లు పేరుచెప్పి కన్నబిడ్డల జీవితాలను కాటికి పంపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని కన్నకూతురిని తల్లి మరియు తండ్రి కలిసి నిద్రపోతూ ఉండగా అతి క్రూరంగా పొడిచి పొడిచి చంపారు. డిగ్రీ చదువుతున్న కుమార్తె గర్భం దాల్చిందని తెలిసి తల్లిదండ్రులు కోపంతో కూతురిని చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే. గద్వాల జిల్లా మానవపాడు మండలం కల్లుకుంట్లకు చెందిన భాస్కర శెట్టి, వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తె (20 ఏళ్లు) ఏపీలోని కర్నూలు పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. అదే కాలేజీలో ఓ యువకుడిని ప్రేమించింది.
మార్చి లో లాక్ డౌన్ అమ్ములు కాకముందు రెండు రోజులు ముందు ఇంటికి వచ్చింది. అయితే ఆమె అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో తల్లిదండ్రులు ఆరా తీయగా మనతోపాటు ప్రేమిస్తున్న యువకుడు తక్కువ కులం వాడు అది తెలుసుకుని వెంటనే తల్లిదండ్రులు ఆ గర్భాన్ని తీసేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. అబార్షన్ చేయించుకోవాలని లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాలని లేదా మేము చనిపోతామూ అంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి ఎంతగా చెప్పినా వినక పోవడంతో నిద్రిస్తుండగా తల్లిదండ్రులు ఇద్దరూ పథకం ప్రకారం గొంతు నులిమి కత్తితో ఊపిరాడకుండా పొడిచి పొడిచి చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది.