Divorce :వివాహం అనేది రెండు మనస్సులు..ఇద్దరు వ్యక్తులు..రెండు కుటుంబాలకు సంబందించిన విషయం గా చెప్పుకోవాలి.ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెద్దలు కుదర్చిన ఈ మధ్యకాలంలో విడిపోవడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు నేటి యువత..ఎంత తొందరగా దగ్గరవుతున్నారో అంత తొందరగా విడిపోతున్నారు..
ఈ దీనితో నష్టపోయేవారు ఎవరయినా ఉన్నారు అంటే అది వారి సంతానం అనే చెప్పాలి.వారు తీసుకునే నిర్ణయాల వలన వారి పిల్లలు.. సింగిల్ పేరెంట్ దగ్గరే పెరగాల్సి వస్తుంది. తల్లి లేదా లేదా తండ్రి,ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రేమను మాత్రమే పిల్లలు పొందగలుగుతున్నారు. ఈ విధానం పై మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది….ఈ సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ చాలా ప్రమాదకరమైనది అని న్యాయస్థానం తెలియచేసింది. పిల్లల చక్కని భవిష్యత్తు కోసం తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ చాలా అవసరమని న్యాయస్థానం సూచించింది.
అయితే సింగిల్ పేరెంటింగ్తో వారు ఒకరి ఆప్యాయత ను పొందుతూ ఇంకొకరి ఆప్యాయతకు దూరమవుతున్నారు అని ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు . అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఆలోచించి అడుగు వేయవలసి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు పాడు చేసే అధికారం ఏ తల్లి దండ్రులకు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి.
భార్యాభర్తలు విడిపోవటం వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కావొచ్చు కాని కానీ తల్లిదండ్రులు విడిపోవడం అనేది పిల్లలు అంత తేలికగా మర్చిపోలేరు. తల్లిదండ్రుల లో ఏ ఒక్కరు దూరమైనా పిల్లల బాధ వర్ణనాతీతం అని చెప్పక తప్పదు. తల్లి, తండ్రి ఎవరు దూరం అయినా తట్టుకోలేక పోతారు . ఆ ప్రభావం వారి చదువు, భవిష్యత్తు మీద కూడా పడుతుంది. ప్రతి విషయంలోనూ పేరెంట్స్ తమ బలం అని అనుకునే పిల్లలకి ఇద్దరిలో ఒకరు దూరం కావడం మానసికంగా పెద్ద షాక్ అని అర్ధం చేసుకోండి. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలపై ఆ ప్రభావం వారు పెద్దయ్యాక కూడా ఆ ప్రభావం కనబడుతుంది. అయితే విడిపోవడం అనేది తప్పనిసరి పరిస్థితి అనుకుంటే.. భార్యాభర్తలు బిడ్డలపై ఎటువంటి నెగిటివ్ ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన పరిస్థితి కొంతవరకు మెరుగు పడే అవకాశం ఉంది అనే చెప్పాలి.