Parineethi chopra : పరిణితి చోప్రా రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరో మీద చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో మంచి దూకుడు మీద ఉన్న ఈ హాట్ బ్యూటి నుంచి వరసగా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ అన్న సినిమా నెట్ఫ్లిక్స్ లో వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే మరో రెండు సినిమాలు జస్ట్ వన్ వీక్ గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి.
ఈనెలలోనే పరిణీతి నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మార్చ్ 19న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే మార్చి 26న బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైనా’ బయోపిక్ తో రాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ వరసగా ప్రమోషన్స్ ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పరిణీతి చోప్రా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.
Parineethi chopra : పరిణీతి కి రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే బావుంటుందన్న మాట చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.
ఆయన స్టైల్ అండ్ లుక్స్ బాగా ఇష్టపడతానని .. అవకాశం వస్తే మహేష్ బాబు కి జంటగా నటించాలని ఉందంటూ తన కోరిక ని వెల్లడించింది. అయితే ఇదే సమయంలో సౌత్ లో మరే హీరోతో సినిమా చేయాలనుకోవడం లేదన్న మాట చెప్పి హాట్ టాపిక్ గా మారింది. ఇక పరిణీతి చోప్రా చెప్పిన మాట ని బట్టి చూస్తే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాలో పరిణీతి కి అవకాశం వస్తే బావుంటుందన్న మాట చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.