Parineethi chopra : పరిణీతి చోప్రా .. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికి డెబ్యూ సినిమా నుంచే తనని తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎలాంటి పాత్రలలో అయినా పరిణీతి చోప్రా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశాలు అందుకుంటోంది.
ఎంతమంది బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కొత్త అమ్మాయిలు హీరోయిన్ గా వస్తున్నప్పటికీ పరిణీతి కి మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఏదో హడావుడిగా వచ్చిన అవకాశాలన్నిటిని ఒప్పేసుకోవాలన్న ఆర్బాటం లేకుండా తనకి సూటయ్యే కథలని .. క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ సెటిల్డ్ గా కెరీర్ ని కొనసాగిస్తోంది. బాలీవుడ్ లో కాక దేశ వ్యాప్తంగాను పరిణీతి చోప్రా కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది పరిణీతి నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి.
Parineethi chopra : పరిణీతి చోప్రా హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటుందని చెప్పుకుంటున్నారు.
పరిణీతి గత నెల 26న నెట్ ఫ్లిక్స్ మూవీ ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ 19న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 26న బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైనా’ బయోపిక్ తో రాబోతోంది పరిణీతి చోప్రా. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో రాబోతున్న ఈ బాలీవుడ్ బ్యూటి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటుందని చెప్పుకుంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!