అనంతపురం: ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవం సందర్భంగా రాప్తాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి, మంత్రి పరిటాల సునీత ఉద్వేగానికి గురయ్యారు. ముందుగా తన భర్త దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర సమాధి వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంలో సునీత ఉద్వేగానికి గురై కళ్లనీళ్లు పెట్టుకున్నారు. అనంతరం చైతన్య రధానికి కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్, కోడలు జ్ఞానవి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరిటాల సునత మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థుల విజయానికి కారణం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?