(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విదేశీ విరాళాల క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లు 2020 కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ కీలక బిల్లు పార్లమెంట్ లో పాస్ కాగా నేడు రాజ్యసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎంపిల సస్పెన్షన్ నేపథ్యంలో విపక్ష సభ్యులు రాజ్యసభ సమావేశాలను బహిష్కరించడంతో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది.
ఈ బిల్లు ప్రకారం స్వచ్చంద సంస్థలు రిజిస్ట్రేషన్ సమయంలో ఆయా సంస్థల కార్యనిర్వహకులు తమ ఆధార్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు విదేశీ నిధులు అందడాన్ని ఈ బిల్లు నిరోధిస్తుంది.
ఈ సమావేశాల్లో కీలకమైన వ్యవసాయ బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఒక పక్క ఈ బిల్లుపై విపక్షాలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం వ్యవసాయ బిల్లులకు ఆమోదం చేసుకున్నది. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఆకాళీదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. హరియానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?