దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా పరశురామ్ ఇమేజ్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. గీత గోవిందం హిట్ తర్వాత మహేష్ బాబు పరశురామ్ కు ఓ మూవీ ఆఫర్ ఇచ్చాడు. దీంతో నాగచైతన్య ప్రాజెక్టును పక్కన పెట్టి మరీ మహేష్ బాబు కోసం సర్కారు వారి పాట మూవీ చేశాడు. పరుశురామ్ కెరీర్లో ఒక హిట్.. ఆ తర్వాత ఒక ఫ్లాప్ రావడం అనేది కామన్. కానీ గీత గోవిందం తరువాత వచ్చిన సర్కార్ వారి పాట కూడా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అలానే మహేష్ బాబుకు తనపై ఉన్న నమ్మకాన్ని పరశురామ్ నిలబెట్టుకున్నాడు.
పరుశురామ్ కొంప ముంచిందదే..?
అయితే సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తున్నా పరశురామ్ కొత్త సినిమా గురించి అనౌన్స్ చేయడం లేదు. అసలైతే సర్కార్ వారి పాట కంటే ముందే నాగచైతన్యతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది కానీ మహేష్ బాబు ఆఫర్ ఇవ్వటంతో నాగచైతన్యతో చేసే ప్రాజెక్టును పక్కన పెట్టేసాడు. దీంతో నాగచైతన్యతో తీయాలనుకున్న సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. నాగచైతన్య థాంక్యూ ప్రమోషన్లు ఇప్పటికే అన్ని పూర్తయ్యాయి. సినిమా రిలీజ్ కూడా కావడంతో అతను ఫ్రీ అయిపోయాడు. అయినా కూడా పరశురామ్ తో కలిసి కొత్త సినిమా ప్రారంభించేందుకు చైతూ అస్సలు ఆసక్తి చూపడం లేదని సినీ వర్గాల్లో టాక్.
సినిమా క్యాన్సిల్
ఇటీవల నాగ చైతన్య మాట్లాడుతూ పరశురామ్తో చేసే మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక లైన్ మాత్రమే విన్నానని ఇంకా మూవీ స్క్రిప్ట్ ఫైనలైజ్ కూడా చేయలేదని అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే అతను ఈ సినిమాని అసలు చేయాలని అనుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు రద్దు అవ్వచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకి ఒప్పుకోవాలన్నా నాగచైతన్య ప్రస్తుత కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకొని స్క్రిప్టు నచ్చితే ముందుకు వెళ్లవచ్చు. ఎలా చూసినా కూడా పరుశురామ్ ఈ ఏడాది మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం పరుశురామ్ నాగచైతన్య ప్రాజెక్ట్ ని పక్కన పడేసి మహేష్ బాబు పిలవగానే వెళ్ళిపోవడమే అని అంటున్నారు. తన సినిమా కాదని వెళ్లిపోయిన అందుకే నాగచైతన్య కోపంగా ఉన్నాడని, అందుకే ఆయన అలాంటి కామెంట్స్ చేశాడని అంటున్నారు.