దివంగత టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవిపై హిందూపురం వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధానికి, ప్రచ్చన్న యుద్దానికి తెరతీస్తున్నాయి. మాధవ్ చేసిన వ్యాఖ్యలపై పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు.
పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రశాంతంగా ఉన్నారని గుర్తు చేశారు పరిటాల సునీత. “నీ చరిత్ర మాకు తెలుసు..నీలా రొడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం, మరో సారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు” అని పరిటాల సునీత హెచ్చరించారు.
ఇదికూడా చదవండి..తేనె తుట్టె కదిపిన వైసీపీ ఎంపీ మాధవ్..! అనంతలో ఏం జరుగుతుందో..!?
గోరంట్ల మాధవ్ నిన్న రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్ల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత టీడీపీ మంత్రి పరిటాల రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిపై పరిటాల అభిమానులు గోరంట్ల పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు