Pattabhi : ఈరోజు ఉదయం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి Pattabhi పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకపక్క అచ్చెన్నాయుడు అరెస్ట్ మరోపక్క పట్టాభి పై దాడి జరగటంతో టిడిపి పార్టీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలలో గెలవలేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదిలాఉంటే పట్టాభి కి గాయాలు కావడంతో వెంటనే చంద్రబాబు పరామర్శ కి వచ్చి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడటం జరిగింది. ఇలాంటి తరుణంలో పోలీసులు జరిగిన ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు దాడి జరిగిన సమీప ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ మొత్తం సేకరించి దాదాపు పది మందిని గుర్తించినట్లు ఏపీ రాజకీయాల్లో సరికొత్త టాక్ వినపడుతోంది.
మరి కొద్ది గంటల్లో ఆ పది మందిని అరెస్టు చేసి మీడియా ముందు తీసుకురావడానికి ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు, అసలు పట్టాభి ని దాడి చేసే కోణం విషయంలో .. ఎలాంటి అరాచక శక్తులు పాల్గొన్నయో అన్న దానిపై పోలీసులు విచారణ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఏదిఏమైనా పట్టాభి పై దాడికి పాల్పడిన 15 మందిలో దాదాపు పది మందిని పోలీసులు గుర్తించినట్లు.. పట్టాభి కారు ఇంటి నుండి బయలుదేరగానే పక్క వీధిలోనే వీళ్లంతా పక్కా స్కేచ్ తో దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈరోజు సీసీ ఫుటేజ్ మాత్రమేకాక పట్టాభి ఇంటి ప్రాంతానికి సంబంధించి రెండు మూడు రోజులు సిసి పుటేజ్ లు పరిశీలించినట్లు పక్కా రెక్కీ నిర్వహించి.. దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.