భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సిపి పార్టీని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీల నేతలు పెద్దగా ముందుకు రాని పరిస్థితి మొన్నటి వరకు నెలకొంది. అధికార పార్టీని ప్రశ్నించిన గానీ వాళ్ళ నుండి సరైన సమాధానం రాదు భారీ మెజార్టీ తో ఉన్నారు అనే భావనలో టీడీపీ నేతలు మొన్నటి వరకు ఉన్నారు. ఇలాంటి తరుణంలో తన దగ్గర సాక్ష్యాధారాలతో అన్ని సమకూర్చుకొని బెజవాడ ప్రాంతానికి చెందిన నాయకుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభి చేస్తున్న రాజకీయానికి టీడీపీ నేతల్లో తో పాటు అధికార పార్టీ నేతల లో కూడా బ్యాక్ టు బ్యాక్ డిస్కషన్లు జరుగుతున్నాయని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
108 ఆంబులెన్స్ విషయంలో సరైన పాయింట్లతో అరవింద గ్రూప్కు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు అనే పాయింట్ లేవనెత్తి దానిలో భాగంగా విజయసాయి రెడ్డి అల్లుడు ప్రస్తావన తీసుకురావడం నిజంగా హైలెట్. దీంతో ఒక్కసారిగా అధికారపార్టీ షేక్ అయ్యి స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే ఇలా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ దానికి భిన్నంగా పట్టాభి చేసిన ఆరోపణలకు ఏకంగా మంత్రులే ఈ విషయం గురించి మీడియా ముందు వివరణ ఇచ్చేలా చేయటం తో పట్టాభి గురించి టీడీపీలో ఉన్న సీనియర్లు కూడా తెగ డిస్కషన్స్ చేస్తున్నారట.
ఇదే తరుణంలో ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ సొంత కంపెనీ సరస్వతి సిమెంట్ వ్యవహారం లో హై కోర్టును తప్పుదోవ పట్టించారు అంటూ సరికొత్త అంశాన్ని పట్టాభి తెరపైకి తీసుకురావడంతో ఈ విషయం గురించి టీడీపీ లోనూ మరియు వైసీపీ లోనూ భారీగా చర్చలు జరుగుతున్నాయట. మరోపక్క ఇప్పటివరకు టీడీపీ పార్టీ నేతలు చాలామంది అధికార పార్టీని ప్రశ్నించిన వాళ్ల ప్రశ్నలకు కదలలేని వైసీపీ నేతలు పట్టాభి వేస్తున్న ప్రశ్నలకు కదిలిపోయే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో పట్టాభి దూకుడుకు సొంత పార్టీ నేతలు కూడా బెంబేలెత్తుతున్నట్లు బెజవాడ పాలిటిక్స్ లో టాక్ నడుస్తుంది.