భారతీయ జనతా పార్టీ – జనసేన కలిసినప్పుడు వారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా పైనే కన్ను వేస్తారని ఆ పార్టీ ని టార్గెట్ చేస్తారన్నది సుస్పష్టం. అయితే ఇంత త్వరగా అదనుచూసి బాబు కి చెక్ పెడతారు అన్నది మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోయారు. విషయం ఏమిటంటే అమరావతి తరపున మాట్లాడుతూ బాబు ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా దూరం అయిపోయాడు. ఆ పార్టీ లోని టీడీపీ నేతలంతా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ కు భయపడి ఎప్పుడు వైసీపీ లోకి జంప్ చేద్దామా…. అని కాచుకు కూర్చున్నారు. ఇదంతా అందరూ ఊహించినదే అయినా ఇక్కడ బిజెపి-జనసేన ఎలా లాభపడతాయని అందరికీ ఒక డౌట్ రావచ్చు.
విషయం ఏమిటంటే బిజెపి 3 రాజధానుల కే మొగ్గు చూపుతుంది అన్నది అర్థమైంది. అటు హైకమాండ్ తో పాటు ఇప్పుడు రాష్ట్ర బిజెపి కూడా వైజాగ్ కు మొదటి ప్రాధాన్యతను ఇస్తోంది. ఇక్కడి వరకు ఒక అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఇక పవన్ విషయానికి వస్తే,,, ఈ మధ్య అతను మాట్లాడుతున్న వైనం మనం గమనించినట్లైతే అమరావతిలో రాజధాని ఉంచాలని డిమాండ్ చేయడం లేదు. కేవలం అమరావతి రైతులకు న్యాయం చేకూర్చే మార్గం ఏది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. మూడు రాజధానులు చెత్త నిర్ణయం అని ఎద్దేవా వేయడం లేదు. అది కూడా ఈ మధ్యన గవర్నర్ ఆమోదముద్ర పడిన తర్వాతనే ఈ వాదన మొదలుపెట్టాడు.
కాపు సామాజిక వర్గం బలంగా ఉండే ఏరియాల్లో తమ ముద్ర వేసుకునేందుకు బిజెపి ఇప్పుడే ఉత్తరాంధ్ర వైపు కన్నేసింది. అందుకు తగ్గట్టు సోము వీర్రాజు చిరంజీవిని కలవడం కూడా జరిగిపోయింది. ఇక ఇదే సమయంలో పవన్…. అమరావతి రైతుల తరఫున ఉన్నాడు కాబట్టి ప్రకాశం నుండి మొదలుకొని శ్రీకాకుళం వరకు బీజేపీ జనసేన పార్టీ ఒక పక్కా వ్యూహం తో చంద్రబాబు ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. మరి తెదేపా ప్రతిపక్ష హోదా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా లేదా ఈ మధ్యలోనే ఊడుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న లా ఉంది.