BREAKING: టాలీవుడ్(Tollywood) బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా పవన్ మార్కెట్ నీ డీ కొట్టే హీరో మరొకరు లేరని చాలా సందర్భాలలో రుజువైంది. పవన్ సినిమా రిలీజవుతుందంటే చాలు ఎంతటి పెద్ద హీరో అయినా ఎంత హై బడ్జెట్ సినిమా అయినా.. ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. పవన్ క్రేజ్ అదేరీతిలో పవన్ మేనియా ముందు.. తేలిపోతాయి. సినిమా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం పవన్ సినిమాపైనే ఉండే పరిస్థితి. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా సినిమా “భీమ్లా నాయక్”(Bheemla Nayak) జనవరిలో రిలీజ్ అవుతుందని అధికారికంగా మొన్న ప్రకటించటం జరిగింది.
సరిగ్గా సంక్రాంతి సీజన్ టైంలో “భీమ్లా నాయక్” మేకర్స్ మార్కెట్ కొల్లగొట్టాలని భారీ ఎత్తున ప్లాన్ వేశారు. కానీ ఇదే టయానికి ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన “రాధేశ్యాం”(Radheyshyam), బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా RRR సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు.. నిర్మాతలు ప్రకటించడం జరిగింది. దీంతో మూడు పెద్ద సినిమాలు ఒకేసారి సంక్రాంతి పండుగకు విడుదల చేయడం వల్ల.. సినిమాల మధ్య పోటీ ఏర్పడటంతో… పెద్ద హీరోలు కావటం తో.. సినిమా విడుదలైన గాని.. మార్కెట్ పరంగా ఎవరికి లాభం ఉండదని.. భావించి నిర్మాత దిల్ రాజు..RRR సినిమా నిర్మాతలు ఈ విషయంలో చొరవ తీసుకుని… పవన్ కళ్యాణ్ తో మాట్లాడటం జరిగిందట. మూడు సినిమాలు విడుదల అయినా కానీ ఎవరికి లాభం ఉండదని మార్కెట్ భాగాలు కావడం వల్ల.. ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. పవన్ కి రిక్వెస్ట్ చేసుకుని భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేసుకోవాలని తెలియజేయడంతో.. ప్రభాస్(Prabhas) కోసం.. ఇండస్ట్రీ మేలుకోసం పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా విడుదల వాయిదా వేసుకోవడం జరిగిందట.
దీంతో జనవరిలో రావాల్సిన “భీమ్లా నాయక్” సినిమా ఫిబ్రవరి మాసంలో 25వ తారీకు సినిమా రిలీజ్… చేయటానికి మేకర్స్ డిసైడ్ అయ్యారట. సంక్రాంతి సీజన్ పవన్ మిస్ కావడంతోపాటు భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడటంతో.. పవన్ అభిమానులు తాజా వార్త పై నిరాశ చెందుతున్నారు. ఈ పరిణామంతో జనవరి మాసం లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “రాదేశ్యం”.. జక్కన్న RRR సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండటం తో… ప్రభాస్ ఎన్టీఆర్ మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రెండూ కూడా పాన్ ఇండియా హై బడ్జెట్ సినిమాలు కావటంతో.. కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో సినిమా ట్రేడ్ పండితులు లెక్కలు కట్టలేక పోతున్నారు.