జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పార్టీ స్థాపించిన నాటి నుండి వైసిపి పార్టీని టార్గెట్ గా చేసుకునే పవన్ ఎక్కువగా రాజకీయాలు చేసినట్లు అర్థం అవుతోంది. 2014 ఎన్నికలలో ఈ విధంగానే వైసీపీని అధికారానికి దూరం చేశారు. ఆ సమయంలో టీడీపీ -బీజేపీ పార్టీ తో పవన్ పొత్తు పెట్టుకోవటం తో మొత్తం రాజకీయ సమీకరణాలు మార్చే రీతిలో వ్యవహరించారు.
అయితే ఆ తర్వాత రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబు విధివిధానాల వల్ల ప్రభుత్వంపై మాత్రమేకాక జనసేన- బీజేపీ- టీడీపీ కూటమిపై కూడా ప్రభావం చూపడంతో… పవన కూటమి నుండి బయటికి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొట్ట మొదటి సారి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ పై ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రజలనుండి వ్యతిరేకత తీసుకురావాలని పోరాడిన పవన్.. పెద్దగా ప్రజలను కదిలించలేక పోయారు.
ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ప్రస్తుతం డైలమాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం చూస్తే ఫస్ట్ నుండి పవన్ ఫోకస్ గా దూకుడుగా వ్యవహరించే వైసీపీ పార్టీతో తాము పొత్తు పెట్టుకున్న బిజెపి ప్రజా సమస్యలపై పోరాడకుండా సన్నిహితంగా ఉండటం తో పవన్ కి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదట. మరోపక్క బిజెపి జగన్ తో రాజకీయ అవసరాల కారణంగా చాలా విషయాలలో ప్రాధాన్యత ఇవ్వటం కూడా పవన్ కి నచ్చటం లేదు అన్న టాక్ బలంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా వైసీపీ ప్రభుత్వ విధి విధానాలపై విమర్శలు చేస్తే ఆ ప్రభావం బిజెపి తో ముడిపడి ఉన్నదానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో… ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయాలో అర్థం కాని స్థితిలో పవన్ కళ్యాణ్ వున్నట్లు టాక్ వస్తుంది.