పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రేక్షకుల్లోనే ఫ్యాన్స్ ఉన్నారనుకుంటారు అందరు. కాని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు, దర్శకులు, మిగతా హీరోల్లోను ఆయనకి వీరాభిమానులున్నారు. స్టార్ డైరెక్టర్స్ అయిన త్రివిక్రం, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు పవర్ స్టార్ కి ఫ్యాన్స్. యంగ్ హీరో నితిన్, అలాగే బండ్ల గణేష్ పవర్ స్టార్ కి డై హార్ట్ ఫ్యాన్స్. ఇక దిల్ రాజు అయితే పవన్ డేట్స్ కోసం ఏకంగా పదేళ్ళ నుంచి వేయిట్ చేసి ఎట్టకేలకి ఇప్పుడు వకీల్ సాబ్ నిర్మిస్తున్నాడు.
అయితే ఏ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ గాని సెట్ కి గాని వెళితే స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. కట్ అని వినిపిస్తుంటాయి. ఒక షాట్ కంప్లీటవగానే గ్యాప్లో కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ నెక్ట్స్ తియ్యబోయే షాట్కి రెడీ అవుతుంటారు. సెట్ డిపార్ట్మెంట్ సెట్ వర్క్ చూసుకుంటారు. ఇలా షూటింగ్ వాతావరణం అంతా సందడి సందడిగా ఉంటుంది. కాని ఆ సెట్లోకి ఒక్కసారి పవన్కల్యాణ్ ఎంటరైతే అందరూ సైలెంట్ అయిపోతారట. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ వెల్లడించారు.
కాగా హరీష్ శంకర్ లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి పవర్ స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ ఏ అంశాలు కోరుకుంటారో అవన్ని ‘గబ్బర్ సింగ్’ చూపించి బ్లాక్బస్టర్ కొట్టారు. అంతేకాదు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ రిపీటవబోతుంది. ప్రస్తుతం చేస్తున్న ‘వకీల్ సాబ్’, క్రిష్ సినిమా కంప్లీట్ అయ్యాక, హరీష్ డైరెక్షన్లో పవన్ నటించబోతున్నాడు.
బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన గబ్బర్ సింగ్’లో ఎంటర్టైన్మెంట్, హీరోయిజమ్ మీద హరీష్ శంకర్ ఎక్కువగా ఫోకస్ చేశాడు. అయితే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే వుండదని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే హింట్ ఇచ్చారు. అయితే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని టచ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.