Bjp-Tdp-Janasena: బీజేపీ-టీడీపీ-జనసేన.. Bjp-Tdp-Janasena కూటమిపై మళ్లీ చంద్రబాబు ఆశలు పెట్టుకున్నట్టే ఉన్నారు. మహానాడులో.. ‘ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికారపార్టీపై పోరులో భాగంగా విపక్షాలతో కలిసి వెళ్తాం. కేంద్రంలో బీజేపీకి విడతలవారీ మద్దతిస్తాం’ అని ఓ ప్రకటన చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. ‘ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే మోదీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మాకు జనసేనతో గట్టి పొత్తు ఉంది. వైసీపీ, టీడీపీలపై పోరు సాగిస్తాం’ అని సునీల్ దియోధర్.. ‘టీడీపీపాచికలు ఇక పారవు. జనసేనతో బలమైన పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్తాం’ అని విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. దీని వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
బీజేపీ-జనసేన.. 2024 ఎన్నికలే లక్ష్యంగా తమ పొత్తు కొనసాగుతుందని గతంలోనే స్పష్టం చేశాయి. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం కలిసే వెళ్లారు. అయితే.. బీజేపీ తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేస్తే.. అధిష్టానం ఆఘమేఘాల మీద క్లియర్ చేసేసింది. ఇప్పుడంతా ఓకే. అందుకే చంద్రబాబు ఆలోచనను ఆదిలోనే గట్టిగా ఖండించి.. జనసేనతో మైత్రి బలమెంతో చెప్పింది. అయితే.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక పనవ్ కల్యాణ్ ఉన్నారనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికీ టీడీపీ బీ-టీమ్ అనే ముద్రను జనసేన చెరుపుకోలేక పోతోంది. రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ-జనసేనకు ఒకరి మద్దతు మరొకరికి అవసరం. అందుకే టీడీపీతో సంబంధంలేని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీజేపీతో టీడీపీకి గట్టి కౌంటర్ పవన్ ఇప్పించారనీ చెప్పొచ్చు.
Read More:Tdp-Janasena: టీడీపీ-జనసేన ట్విట్టర్ వార్..! హ్యాష్ ట్యాగ్ లతో హల్ చల్..!!
బీజేపీ-జనసేనను వదులుకుని ఎంత నష్టపోయామో 2019 ఎన్నికల్లో చూసారు చంద్రబాబు. బీజేపీతో నాడు విభేధించి.. మోదీని విమర్శించి ఇటివల పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. 2014లో తమ మద్దతుతో గెలిచి.. తర్వాత దూరం పెట్టిన చంద్రబాబుని వీరూ మర్చిపోలేదు. తమను వాడుకుని టీడీపీ లాభపడుతోందని గ్రహించారు. అందుకే 2024 ఎన్నికలే లక్ష్యంగా వెళ్లాలన్నా.. తమ మైత్రిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఇప్పటినుంచే ఖచ్చితంగా ఉండాలి. అందుకే టీడీపీపై బీజేపీ ఈస్థాయిలో ఫైర్ అయిందని చెప్పాలి. అయితే.. పవన్ కు తెలీకుండా.. పవన్ ప్రమేయం లేకుండా బీజేపీ ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని మాత్రం చెప్పలేం.