జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాను నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి అంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని ని ఉద్దేశించి అదేవిధంగా పేర్ని నాని ని టార్గెట్ చేసుకుని భారీ స్థాయిలో కామెంట్లు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే పవన్ ప్రసంగ తీరు గతంలో కంటే చాలా భిన్నంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి మొన్నటి వరకు ఇష్టానుసారంగా.. సబ్జెక్ట్ మాట్లాడే కంటే కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఊగిపోతూ, ఆవేశంగా ఏది పడితే అది అన్నట్టు మాట్లాడుతూ ఉండగా మధ్యలో అభిమానులు కేరింతలు చప్పట్లు విజిల్స్ వేయటంతో పవన్ ఏం మాట్లాడారు అన్న దాని విషయంలో సామాన్యుడికి అర్థం కాని పరిస్థితి ఏర్పడేది.
దీంతో పవన్ ఒక హీరోగానే అన్నట్టు ప్రోజెక్ట్ అయ్యేది. కానీ తాజాగా గుడివాడ అదే విధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ ప్రసంగం తీరు గతానికి భిన్నంగా ఉంది. సబ్జెక్ట్ మాట్లాడుతూ సెటైరికల్ గా స్పష్టంగా ఈ విషయాన్ని మాత్రం చెప్పదలిచారు. చెప్పినదానిలో నిజమెంతో అనేది పక్కన పెట్టేస్తే.. అభిమానులను ఎంటర్టైన్ చేసే తరహాలో ప్రసంగం చేస్తూనే మరో పక్క ప్రత్యర్థులకు తాను చెప్పదలుచుకున్నది పవన్ చెప్పటం జరిగింది. నిలదీయాల్సిన విషయాల్లో నిలదీస్తూ నే మరోపక్క తన గురించి గతంలో వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు కౌంటర్లు వేస్తూ వచ్చారు. మొత్తంమీద చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ మైకు ముందు ఆవేశంగా ఊగిపోతూ ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధంకాని రీతిలో పరిస్థితి నెలకొంటే తాజాగా మాత్రం దానికి భిన్నంగా ఆవేశానికి లోను కాకుండా.. తాను చెప్పదలుచుకున్నది సెటైరికల్ గా కూల్ గా పవన్ చెప్పాడని, తన ప్రసంగ తీరు పంథా మార్చాడని విశ్లేషకులు అంటున్నారు.