పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వతా రీసెంట్ గా ప్రకటించిన సినిమాతో కలిపి మొత్తం ఆరు సినిమాలు అఫీషియల్ గా కమిటయ్యాడు. ఈ సినిమాలలో వకీల్ సాబ్ దాదాపు పూర్తి కావస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 2021 సంక్రాంతి రేస్ లో వకీల్ సాబ్ దిగబోతుందని తెలుస్తుంది. అయితే ఇన్నాళ్ళు కరోనా వల్ల సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి కమిటయిన సినిమాలన్నిటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ రావాలని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
వకీల్ సాబ్ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మించనున్న పీరియాడికల్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ వీలైనత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని మేకర్స్ కి సూచించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా గనక కంప్లీట్ అయితే మిగతావన్ని కాస్త త్వరగానే కంప్లీటవుతాయంటున్నారు. అంతేకాదు పవన్ – క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఉందట.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిచబోతున్న పవన్ కళ్యాణ్.. క్రిష్ సినిమాకి కాస్త అటు ఇటుగా కంప్లీట్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే హరీష్ శంకర్ కంప్లీట్ స్క్రిప్ట్ తో సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లోనే కేవలం 25 రోజులు డేట్స్ కేటాయింది. రీసెంట్ గా కమిటయిన మలయాళ హిట్ సినిమా అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్ ని .. పవన్ సీన్స్ వరకు కంపీటయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట.
ఇక మిగిలింది స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందబోయో సినిమా. ఈ రెండు సినిమాలని 2022 సమ్మర్ లోపు ముగించేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల లోపు వీలును బట్టి మరో రెండు సినిమాలని ఒప్పుకునే అవకాశం ఉందట.
అయితే ఇన్ని సినిమాలు కమిటయినప్పటికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం హడావుడి చేయకుండా సైలెంట్ గా ఉన్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా బేసిగ్గా పవర్ స్టార్ కి సినిమాల విషయంలోనే కాదు మామూలుగా కూడా హంగు, ఆర్భాటాలకి దూరంగా ఉంటారన్న సంగతి తెల్సిందే. ఇలాంటివన్ని పవన్ కళ్యాణ్ కి నచ్చదు. కాబట్టే ఫ్యాన్స్ కూడా సైలెంట్ గా ఉన్నారని చెప్పుకుంటున్నారు. లేదంటే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడమే కష్టం.