విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది.
విజయనగరం పర్యటన ముగించుకొని గుంటూరు జిల్లాలో ప్రచార సభలకు వెళ్లేందుకు హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్న పవన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని పవన్కు సూచించారు.
దీంతో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన సత్తెనపల్లి, తెనాలి సభలను రద్దుచేసినట్టు పార్టీ నేతలు తెలిపారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?