పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం మొత్తం ఉన్న అతని ఫాన్స్ వేడుకలు జరిపేందుకు ఘనంగా సన్నాహాలు జరుపుతున్నారు. అయితే ఎంతో విషాదకరంగా రేపు అతని పుట్టిన రోజు అనగా ఈరోజు ముగ్గురు పవన్ ఫ్యాన్స్ మృతి చెందడం జరిగింది.
చిత్తూరు జిల్లాలోని కుప్పం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పలమనేరు నేషనల్ హైవే దగ్గర వారి అభిమాన హీరోకి బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. కరెంటు పోల్ ఈ బ్యానర్ ను తగ్గించే క్రమంలో వారు కరెంట్ షాక్ కు గురై చనిపోయినట్లు చెబుతున్నారు. 25 అడుగుల ఎత్తున ఫ్లెక్సీ కడుతుండగా కరెంటు తీగలు తగిలి వారు మృతి చెందారు.
మొత్తం ఏడుగురికి కరెంట్ షాక్ కొట్టగా…. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు…. మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజా సేవకై తన జీవితాన్ని అంకితం ఇచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ విషయం తో పుట్టినరోజు నాడు కూడా తీవ్రంగా కలత చెందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
CBN Press release_01.09.2020_2 (1)