పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోరు మీద వున్నారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో పవన్ తాజాగా సినిమాలు ఒప్పుకోవడంతో.. మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవటమే కాక డబ్బింగ్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయటంతో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ఫిలిం వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి.
ఎక్కువ శాతం వచ్చే సమ్మర్ లో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో “భరత్ అనే నేను” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించినా ఈ ముద్దుగుమ్మ తర్వాత అబ్బాయి రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తో దారుణమైన డిజాస్టర్ పండుకుంది.
ఈ దెబ్బతో తన మకాం మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీలో కి మార్చుకుని అక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇలాంటి తరుణంలో రామ్ చరణ్ తో నటించిన కియారా అద్వాని కి తన సినిమాలో అవకాశం వచ్చేలా పవన్ కళ్యాణ్ సినిమా స్టోరీ తెలుసుకొని..కియారా ని డైరెక్టర్ హరీష్ కి సజెస్ట్ చేసినట్లు, దానికి హరీష్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ తో నటించే ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ కొడితే మాత్రం కియారా అద్వాని కి టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుండదని సినిమా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.