Pawan Kalyan : 2018లో ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్ల మరొక సినిమా రాలేదు. ఒక దశలో మళ్లీ సినిమాలు చేయను అని ప్రకటించిన కళ్యాణ్… 2019 ఎన్నికల తర్వాత మళ్లీ కెమెరా ముందు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అన్నింటికంటే ముందు ‘వకీల్ సాబ్ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసాడు.
ఈ కరోనా లేకుండా ఉంటే గత ఏడాది పవన్ రీ-ఎంట్రీ సినిమా చూసే వాళ్ళం. అయితే మహమ్మారి కారణంగా సిల్వర్ స్క్రీన్ పై పవన్ దర్శనం ఏడాది ఆలస్యం అయింది. ఏప్రిల్ లో ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ మళ్లీ ప్రేక్షకులను పలకరించినబోతున్నాడు. మూడేళ్లు తన అభిమానులకు సినీ కరువు ఇచ్చిన పవన్ ఆ రుణాన్ని వడ్డీతో సహా తీర్చేలా కనిపిస్తున్నాడు. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వకీల్ సాబ్ వచ్చిన 4 నెలలకు కు మరొక సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగు నెలలకు ఇంకొక సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ‘అయ్యప్పనుం కోషియుం’ రీమేక్ మొదలుపెట్టిన పవన్…. ఇదే క్రమంలో క్రిష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ‘అయ్యప్పనుం కోషియుం’ రీమేక్ మూడు నాలుగు నెలల్లో చిత్రీకరణ అయిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ విడుదల చేస్తారని సినీ వర్గాల్లో సమాచారం.
Pawan Kalyan అభిమానులకి ఏడాదంతా పండగే….
ఇక క్రిష్ సినిమా భారీ స్థాయిలో…. ఉన్నప్పటికీ అతను గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి క్వాలిటీ అవుట్ పుట్… అతి తక్కువ సమయంలో తీసిన విధానాన్ని గమనిస్తే దానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. మహా అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ఆ సినిమా విడుదల కచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఇక అదే జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ నుండి వచ్చే ఏడాది జనవరి మధ్యలో…. అంటే ఎనిమిది నెలల వ్యవధిలో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు విడుదల అయిపోతాయి అన్నమాట. పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ని ఇలా వరుస సినిమాల్లో చూడబోతున్నారు అంటేనే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ పంట పండబోతున్నట్లే.